స్వల్ప లక్షణాలుంటే టెస్ట్ చేయించుకోవాలి: సీఎస్ సోమేశ్ కుమార్
By - TV5 Digital Team |6 May 2021 8:00 AM GMT
సికింద్రాబాద్ బొగ్గులకుంట అర్బన్ హెల్త్ టర్ లో కొవిడ్ కౌన్సెలింగ్ సెంటర్ను, జ్వరం లక్షణాలతో వచ్చిన వారికి అందిస్తున్న మందులను పరిశీలించారు.
తెలంగాణలో ర్యాపిడ్ ఫీవర్ సర్వే ప్రారంభమైంది. హైదరాబాద్ లో తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సికింద్రాబాద్ బొగ్గులకుంట అర్బన్ హెల్త్ టర్ లో కొవిడ్ కౌన్సెలింగ్ సెంటర్ను, జ్వరం లక్షణాలతో వచ్చిన వారికి అందిస్తున్న మందులను పరిశీలించారు. స్వల్ప జ్వరం లక్షణాలున్న వారు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి వెళ్లి కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. జ్వరంతో బాధపడేవారు ప్రభుత్వం ఉచితంగా అందించే మందులను వాడాలని సూచించారు. అదే విధంగా ప్రతి ఒక్కరూ విధిగా మాస్కు ధరించాలని సీఎస్ చెప్పారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com