ఆయుష్మాన్ భారత్లో తెలంగాణ.. ఆరోగ్యశ్రీ పథకంతో అనుసంధానం
తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. భారత ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ పథకంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్యశ్రీ పథకాన్ని అనుసంధానం చేయడానికి సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలియజేశారు. ప్రధాని అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో సోమేశ్కుమార్ పాల్గొన్నారు. ఆయుష్మాన్ భారత్, ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన , జల్ జీవన్ మిషన్ పథకాల మౌలిక సదుపాయాల పురోగతిని ప్రధాని సమీక్షించారు. తెలంగాణ రాష్ట్రం మిషన్ భగీరథ ద్వారా అన్ని గృహాలకు పంపులతో సురక్షితమైన నీటిని అందించిందని, తెలంగాణ రాష్ట్రంలో 98.5 శాతం గృహాలు సురక్షితమైన తాగునీటితో కవర్ అయ్యాయని భారత ప్రభుత్వం గుర్తించింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com