SSC Results: రాష్ట్ర పదవతరగతి విద్యార్థుల ఫలితాలు విడుదల
By - prasanna |21 May 2021 7:23 AM GMT
మొత్తం 5,21,393 మంది వార్షిక పరీక్షల కోసం ఫీజు చెల్లించగా వారందరినీ పాస్ చేశారు.
SSC Results: తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డ పదో తరగతి ఫలితాలు విడుదల చేశారు. మొత్తం 5,21,393 మంది వార్షిక పరీక్షల కోసం ఫీజు చెల్లించగా వారందరినీ పాస్ చేశారు. అయితే అందులో 2,10,647 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించినట్లు మంత్రి వెల్లడించారు.
ఫలితాలను bse.telangana.gov.in, results.cgg.gov.in తదితర వెబ్ సైట్లలో అందుబాటులో ఉంచారు. ఈసారి హాల్ టికెట్లు జారీ చేయనందువల్ల చదివిన పాఠశాల పేరు, విద్యార్థి పేరు, పుట్టిన తేదీ వివరాలను వెబ్ సైట్ లో నమోదు చేస్తే హాల్ టికెట్ నంబర్ తో పాటు ఏ గ్రేడ్ వచ్చిందీ తెలుసుకోవచ్చు.
విద్యార్థులకు ఈ మార్కులను ఫార్మేటివ్ అసెస్ మెంట్ (ఎఫ్ఏ)-1లో వచ్చిన మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇచ్చారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com