పిల్లోడి హావభావాలకు బీజేపీ ఎంపీలు ఫిదా.. బాలుడికి అండగా ఉంటామన్న బండి సంజయ్..!
బాన్సువాడ బీజేపీ మీటింగ్లో తన హావభావాలతో ఆకట్టుకున్న బాలుడు.. ఇప్పుడు హాట్ టాఫిక్గా మారాడు. అతని వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బీజేపీ ఎంపీలు చూసి ముచ్చటపడ్డారు. వెంటనే ఆ బాలుడిని తన ఇంటికి పిలిచి కొత్తబట్టలు పెట్టి ఆతిథ్యమిచ్చారు.
బాన్సువాడ బీజేపీ బహిరంగ సభలో ఎంపీ అర్వింద్ ప్రసంగానికి .. నర్సింహా అనే బాలుడు తన హావభావాలతో అదిరిపోయే రియాక్షన్ ఇచ్చాడు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో .. ఎంపీ అర్వింద్ బాలుడిని నిజామాబాద్లోని తన ఇంటికి పిలిచి కొత్తబట్టలు పెట్టాడు. తనతోపాటు నర్సింహకు భోజనం పెట్టాడు. బాలుడు ఏం చదువుకుంటానన్న అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
బాలుడు నర్సింహకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోకి తీసుకొచ్చి స్వీట్లు తినిపించారు. కొత్తబట్టలు పెట్టి.. బాలుడిని చదివించే బాధ్యత బీజేపీ తీసుకుంటుందని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. పార్టీ కార్యకర్తలు, నేతలు బాలుడు నర్సింహను సత్కరించారు. బాన్సువాడ సభలో తన రియాక్షన్తో ఆకట్టుకున్న బాలుడిని కలుస్తానని ఎంపీ అర్వింద్ తో చెప్పానన్నారు బండిసంజయ్.
ఆ బాలుడి వీడియో తాను 50 సార్లు చూశానన్నారు. చిన్నబాలుడి నుంచి పండు ముసలివరకు కేసీఆర్ పై కోపంతో ఉన్నారని బండి సంజయ్ అన్నారు. బాలుడు నర్సింహది నిరుపేద కుటుంబం. ఉండటానికి కనీసం ఇళ్లు కూడా లేదన్నారు. బాన్సువాడ బీజేపీ బహిరంగ సభ సందర్భంగా ఎంపీ అర్వింద్ ప్రసంగిస్తుండగా.. వాటికి అనుగుణంగా ఈ బాలుడు అదిరిపోయే రియాక్షన్ ఇచ్చాడు. అర్వింద్ మాటలకు తన అరుపులు, కేకలతో హోరెత్తించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com