దళిత బంధు పథకం అమలు, కార్యాచరణపై ఇవాళ తొలి అవగాహన సదస్సు.!

దళిత బంధు పథకం అమలు, కార్యాచరణపై ఇవాళ తొలి అవగాహన సదస్సు.!
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దళిత బంధు పథకం అమలు, కార్యాచరణపై ఇవాళ తొలి అవగాహన సదస్సు నిర్వహించనున్నారు సీఎం కేసీఆర్‌.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దళిత బంధు పథకం అమలు, కార్యాచరణపై ఇవాళ తొలి అవగాహన సదస్సు నిర్వహించనున్నారు సీఎం కేసీఆర్‌. హుజురాబాద్ నియోజకవర్గంలో ఈ పథకం పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభం కానుంది. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే సదస్సు సాయంత్రం వరకు నిర్వహించనున్నారు. హుజురాబాద్‌ నియోజకవర్గం నుంచి 427 మంది దళితులు ఈ సదస్సుకు హాజరయ్యేందుకు బస్సుల్లో బయల్దేరారు. గ్రామానికి నలుగురు చొప్పున ఇద్దరు పురుషులు ఇద్దరు మహిళలు, ప్రతి మున్సిపాలిటీలోని ఒక్కొక్క వార్డు నుంచి నలుగురు చొప్పున ఇద్దరు పురుషులు ఇద్దరు మహిళలు ఈ సదస్సులో పాల్గొంటారు. మరో 15 మంది రిసోర్స్‌ పర్సన్స్‌తో కలిపి మొత్తం 427 మంది ఈ సమావేశానికి హాజరుకానున్నారు.

దళిత బంధు పథకం అమలు, పర్యవేక్షణ, నిర్వహణతో పాటు విజయవంతం చేయటానికి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం వారికి అవగాహన కల్పిస్తారు. దళిత బంధు రాష్ట్రంలోని దళితులందరి జీవితాల్లో గుణాత్మక మార్పునకు ఏ విధంగా దోహదపడుతుంది? దళితుల సామాజిక, ఆర్థిక గౌరవాన్ని ఉన్నత శిఖరాల్లో నిలబెట్టే దిశగా ప్రభుత్వం అమలు చేయబోతున్న దళిత బంధు పథక ఉద్దేశాలేంటి? ఈ పథకాన్ని దళితుల్లోకి ఎలా తీసుకపోవాలి? వారి జీవితాలను వారే అభివృద్ధి చేసుకునే దిశగా వారికి ఎలా అవగాహన కల్పించాలి? అధికారులతో సమన్వయం ఎలా చేసుకోవాలి? వంటి అంశాలపై స్వయంగా సీఎం కేసీఆర్‌ చర్చించి, దిశానిర్దేశం చేయనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story