రేపు టీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష సమావేశం.. కీలక అంశాలపై సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం

రేపు టీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష సమావేశం.. కీలక అంశాలపై సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం
KCR : సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన టీఆర్ఎస్ శాసనసభాపక్షం రేపు సమావేశం కానుంది. ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వం, బీజేపీ వైఖరిపై సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు.
KCR : సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన టీఆర్ఎస్ శాసనసభాపక్షం రేపు సమావేశం కానుంది. ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వం, బీజేపీ వైఖరిపై సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక తీరు, రాష్ట్ర బీజేపీ మరోతీరు వ్యవహరిస్తూ రైతులను అయోమయానికి గురి చేస్తోందని ఆరోపిస్తోంది టీఆర్ఎస్. ఈనెల 12న నియోజకవర్గాల వారీగా ధర్నాలు కూడా నిర్వహించింది. కేంద్రం స్పష్టతనిచ్చే వరకూ ఆందోళనలు కొనసాగిస్తామని టీఆర్ఎస్ ఇప్పటికే ప్రకటించింది.

రేపు జరగనున్న సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణను ఖరారు చేయనుంది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో దిల్లీలో రైతుదీక్ష లేదా ధర్నా చేపట్టాలని టీఆర్ఎస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం వైఖరి, రాష్ట్రానికి జరగుతున్న అన్యాయం, బీజేపీ అనుసరిస్తున్న విధానాలు, విపక్షాల ప్రచారాన్ని ఎలా తిప్పికొట్టాలనే విషయాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. దిల్లీ స్థాయి ఆందోళనతో పాటు.. రాష్ట్రంలో ఏ రూపంలో ఆందోళన కొనసాగించాలో రేపు వ్యూహాలను ఖరారు చేయనున్నట్లు సమాచారం.

Tags

Read MoreRead Less
Next Story