తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ

తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ
మద్యం దుకాణాలు, బార్లు, పబ్‌లు, థియేటర్లపై ఎందుకు ఆంక్షలు విధించడం లేదో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

తెలంగాణలో కరోనా కట్టడికి ప్రభుత్వ తీసుకుంటున్న చర్యలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై విచారణ జరిపిన హైకోర్టు.. మద్యం దుకాణాలు, బార్లు, పబ్‌లు, థియేటర్లపై ఎందుకు ఆంక్షలు విధించడం లేదో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆర్టీపీసీఆర్ పరీక్షలు నెమ్మదిగా చేస్తున్నారని.. పూర్తిగా ర్యాపిడ్ టెస్టులపైనే దృష్టి పెట్టారని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది.

కరోనా పరీక్షలు, చికిత్స, నియంత్రణపై హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం నివేదిక సమర్పించింది. పరీక్షలు నెమ్మదిగా పెంచుతున్నామని ప్రభుత్వం తరుఫున ఏజీ ధర్మాసనం దృష్టి తీసుకెళ్లారు. అయితే ఏజీ వాదనలపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన హైకోర్టు.. రెండో దశ కరోనా వేగంగా విస్తరిస్టుంటే.. ఇంకా నెమ్మదిగా పెంచడమేంటని ప్రశ్నించింది. ఆర్టీపీసీఆర్ పరీక్షలు పెంచాలని స్పష్టం చేసింది.

బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, నిర్మాణ ప్రాంతాల్లో పరీక్షల వివరాలు తెలపాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో కరోనా చికిత్స కేంద్రాల వివరాల పై విస్తృత ప్రచారం చేయాలని.. అనాధ, వృద్ధాశ్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపింది. కరోనా నిబంధనలు అమలుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని పేర్కొంది. కరోనా నిబంధనలు పాటించని వారిపై నమోదైన కేసులు, జరిమానాల వివరాలతో పాటు 48 గంటల్లో పూర్తి నివేదిక సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది.


Tags

Read MoreRead Less
Next Story