మద్యం మత్తులో యువకుల వీరంగం.. పోలీసులపై దాడి..!

మద్యం మత్తులో యువకుల వీరంగం.. పోలీసులపై దాడి..!
సిద్ధిపేట జిల్లాలో మద్యం మత్తులో ఇద్దరు యువకులు వీరంగం సృష్టించారు. కోహెడ మండలం కేంద్రంలో పోలీసులపై దాడికి పాల్పడ్డారు.

సిద్ధిపేట జిల్లాలో మద్యం మత్తులో ఇద్దరు యువకులు వీరంగం సృష్టించారు. కోహెడ మండలం కేంద్రంలో పోలీసులపై దాడికి పాల్పడ్డారు. కోహెడ పాత బస్టాండ్ వద్ద నిన్న రాత్రి ఇద్దరు యువకులు గొడవ పడుతుండగా సమాచారం అందుకున్న పోలీసులు వారిని ఆపే ప్రయత్నం చేశారు. అయితే యువకులు కానిస్టేబుళ్లపై కర్రతో దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో ఓ కానిస్టేబుల్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దాడికి పాల్పడిన ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story