ప్రలోభాలకు లొంగకుండా హుజురాబాద్‌ ప్రజలు గొప్ప తీర్పు ఇచ్చారు : కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి

ప్రలోభాలకు లొంగకుండా హుజురాబాద్‌ ప్రజలు గొప్ప తీర్పు ఇచ్చారు :  కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి
Kishan Reddy : ప్రలోభాలు, బెదిరింపులకు లొంగకుండా హుజురాబాద్‌ ప్రజలు... ఈటల వైపు నిలబడ్డారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

Kishan Reddy : ప్రలోభాలు, బెదిరింపులకు లొంగకుండా హుజురాబాద్‌ ప్రజలు... ఈటల వైపు నిలబడ్డారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈటల, బీజేపీలపై విశ్వాసం వుంచి గొప్ప తీర్పు ఇచ్చారని ప్రశంసించారు. హుజురాబాద్‌లో ప్రభుత్వపరంగా చేయని కార్యక్రమంటూ లేదని.. అడిగిన ప్రతి పనిని.. అడగనివి కూడా ఇచ్చారని ఆరోపించారు. కానీ ప్రజలు రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కు ద్వారా .. డబ్బు, పథకాలు, బెదిరింపులకు లొంగకుండా నిరూపించారని కిషన్‌ రెడ్డి కితాబిచ్చారు. డబ్బుకు కాదు మంచితనానికి తమ ఓటు అంటూ ప్రజలు రుజువు చేయారన్నారు. ధర్మం, నీతి, నిజాయితీకి పట్టం కట్టారని.. అధర్మానికి, అన్యాయానికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పునిచ్చారని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Tags

Read MoreRead Less
Next Story