బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బంగారు బోనం ఎత్తుతా : విజయశాంతి
By - Gunnesh UV |1 Aug 2021 11:30 AM GMT
తెలంగాణ రాష్ట్రంలో దోపిడీ పాలన సాగుతుందని.. బీజేపీ నేత విజయశాంతి అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో దోపిడీ పాలన సాగుతుందని.. బీజేపీ నేత విజయశాంతి అన్నారు. గతంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావాలని అమ్మవారిని కోరుకోగా.. ఆమె తన కోరిక నెరవేర్చిందన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత బంగారు బోనం ఎత్తి అమ్మవారి మొక్కు చెల్లించుకున్నానని అన్నారు. ఈసారి బీజేపీ అధికారంలోకి రావాలని అమ్మవారిని కోరినట్లు తెలిపిన విజయశాంతి.. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బంగారు బోనం ఎత్తుతానన్నారు. ప్రజా పాలన బీజేపీ వల్లే సాధ్యమవుతుందన్నారు. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్తో ప్రజలు బాధపడుతున్నారని.. కరోనా తగ్గి అందరిని కాపాడాలని అమ్మవారిని కోరుకున్నట్లు చెప్పారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com