త్వర‌లోనే ఆర్టీసీ ఉద్యోగుల‌కు వేత‌నాల పెంపు : ‌సీఎం కేసీఆర్

త్వర‌లోనే ఆర్టీసీ ఉద్యోగుల‌కు వేత‌నాల పెంపు : ‌సీఎం కేసీఆర్
శాస‌న‌స‌భ‌లో ద్రవ్య వినిమ‌య బిల్లుపై చ‌ర్చ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్... తెలంగాణ మలిదశ ఉద్యమంలో అన్ని ఉద్యోగుల పాత్ర మరువలేనిది.

ఆర్టీసీ ఉద్యోగులకి శుభవార్తను అందజేశారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఅర్.. శాస‌న‌స‌భ‌లో ద్రవ్య వినిమ‌య బిల్లుపై చ‌ర్చ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్... తెలంగాణ మలిదశ ఉద్యమంలో అన్ని ఉద్యోగుల పాత్ర మరువలేనిది. అందులోనూ ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర కీలకమైనది. ప్రభుత్వ ఉద్యోగుల‌కు పెంచిన‌ట్లే.. ఆర్టీసీ ఉద్యోగుల‌కు కూడా వేత‌నాలు పెంచుతాం. దీనిపైన త్వరలోనే రవాణా శాఖ మంత్రితో మాట్లాడి త్వర‌లోనే చ‌ర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఇక ఈ విషయంలో ఆర్టీసీ ఉద్యోగులు భ‌య‌ప‌డాల్సిన అవ‌సరం లేదని, ఆర్టీసీని కాపాడుతున్నాం. బ‌డ్జెట్‌లో రూ. 3000 కోట్లు కేటాయించామని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story