లోటస్ పాండ్‌లో షర్మిల.. భారీగా వెలసిన ఫ్లెక్సీలు..

లోటస్ పాండ్‌లో షర్మిల.. భారీగా వెలసిన ఫ్లెక్సీలు..
జనంలోకి షర్మిలక్క వస్తుంది.. జనరంజక పాలన అందిస్తుంది

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిల కొత్త పార్టీకి కార్యాచరణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌ను వేదిక చేసుకున్నారు. లోటస్ పాండ్ నుంచి భారీ ఎత్తున అనుచరులను కూడగట్టుకుని ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో అక్కడ భారీ ఎత్తున షర్మిల ఫ్లెక్సీలను ఏర్పాటు చేసారు కార్యకర్తలు. జనంలోకి షర్మిలక్క వస్తుంది.. జనరంజక పాలన అందిస్తుంది అని ఒక ఫ్లెక్సీలో రాస్తే మరో ఫ్లెక్సీలో మన కష్టం తెలుసు.. మన కన్నీళ్లు తెలుసు.. మన బ్రతుకులు మార్చే బాట. వైయస్‌ఆర్ కుటుంబానికి తెలుసు.. షర్మిల నాయత్వం వర్ధిల్లాలి అని ఫ్లెక్సీలలో స్లోగన్స్ దర్శనమిచ్చాయి.

కొత్త పార్టీ షురూ..

షర్మిల కొత్తపార్టీపై కార్యకర్తలతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. షర్మిల పార్టీ ప్రకటనపై అభిమానులు, అనుచరులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాసేపట్లో ప్రారంభం కానున్న సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ గురించి నాయకులు, కార్యకర్తలతో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో రాజకీయంగా ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశాలపై ఈ చర్చ కొనసాగుతుందని సమాచారం.

Tags

Read MoreRead Less
Next Story