సోనూసూద్ రూ.20కోట్లకు పైగా పన్ను ఎగవేశారు.. ఐటీ శాఖ ప్రకటన

సోనూసూద్ రూ.20కోట్లకు పైగా పన్ను ఎగవేశారు.. ఐటీ శాఖ ప్రకటన
సినీ నటుడు సోనూసూద్ ఇంట్లో, కార్యాలయాల్లో ఐటీ దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. నిన్నటి వరకు మూడురోజులు పాటు ఈ సోదాలు చేపట్టింది.

సినీ నటుడు సోనూసూద్ ఇంట్లో, కార్యాలయాల్లో ఐటీ దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. నిన్నటి వరకు మూడురోజులు పాటు ఈ సోదాలు చేపట్టింది. అయితే సోనూసూద్ రూ.20 కోట్లకు పైగా పన్ను ఎగవేసినట్లు శనివారం ఐటీ శాఖా వెల్లడించింది. సోనూసూద్‌తో పాటుగా ఆయన సహచరుల కార్యాలయాల్లో కూడా పన్ను ఎగవేతకు సంబంధించిన ఆధారాలను గుర్తించినట్లు వెల్లడించారు. సోనూసూద్ ఫారిన్ కంట్రిబ్యూషన్( రెగ్యులేషన్) యాక్ట్‌ను ఉల్లంఘించారని ఐటీ అధికారులు పేర్కొన్నారు. కాగా, మొదటి మొదటి వేవ్ సమయంలో చాలా మందికి సహాయం చేసి రియల్ హీరో అని అనిపించుకున్నాడు సోనూసూద్.. అయితే ఆ సమయంలో సోనూసూద్ ఏర్పాటు చేసిన దాతృత్వ సంస్థ రూ.18 కోట్లకు పైగా విరాళాలను సేకరించిందని ఐటీ అధికారులు వెల్లడించారు. ఇందులో రూ.1.9 కోట్లు మాత్రమే సహాయ కార్యక్రమాలకు వినియోగించారని, మిగతా డబ్బు ఆ సంస్థ ఖాతాలోనే ఉండిపోయిందని వారు పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story