చైతూ కోసం సామ్ త్యాగం.. షారుఖ్‌‌తో మిస్..!

చైతూ కోసం సామ్ త్యాగం..  షారుఖ్‌‌తో మిస్..!
Samantha : అక్టోబర్ 2 న టాలీవుడ్ క్యూట్ కపుల్స్ అక్కినేని నాగచైతన్య, సమంత భార్యాభర్తలుగా విడిపోతున్నట్లుగా ప్రకటించిన సంగతి తెలిసిందే..

Samantha : అక్టోబర్ 2 న టాలీవుడ్ క్యూట్ కపుల్స్ అక్కినేని నాగచైతన్య, సమంత భార్యాభర్తలుగా విడిపోతున్నట్లుగా ప్రకటించిన సంగతి తెలిసిందే.. దీనితో వీరి మూడుముళ్ల బంధం నాలుగేళ్లతో ముగిసింది. అయితే వీరిద్దరూ విడిపోవడానికి కారణాలు ఏంటో చెప్పకపోవడంతో ఎక్కువగా సమంత పైన నెటిజన్లు ట్రోల్ చేయడం మొదలు పెట్టారు..

సమంతనే చైతూకి విడాకులు ఇచ్చిందని, ఆమెకి ఎఫైర్స్ ఉన్నాయని, డబ్బు మనిషని, అసలు పిల్లలే వద్దనుకుందని అంటూ రకరకాలుగా సోషల్ మీడియాలో కామెంట్స్ వదిలారు. సామ్ వీటిపైన స్పందించింది కూడా.. ఇప్పుడు అటు సామ్, ఇటు చైతూ ఎవరి సినిమాలలో వారు బిజీగా ఉన్నారు. ఇదిలావుండగా సామ్ చైతన్యతో పిల్లల కోసం, ఫ్యూచర్ ప్లానింగ్ కోసం కొన్ని సినిమాలను కూడా వదిలేసుకుంది అంటూ ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.

బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్, అట్లీ కాంబినేషన్‌‌లో ఓ సినిమా తెరకెక్కుతుంది. హీరోయిన్‌‌గా నయనతార నటిస్తోంది. దీనికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. అయితే ఈ సినిమాలో నయనతార కంటే ముందు ఛాయస్ సామ్ అని తెలుస్తోంది. ఈ సినిమా కోసం దర్శకుడు అట్లీ ముందుగా సమంతని అప్రోచ్ అయ్యాడట.. పిల్లల ప్లానింగ్ నేపధ్యంలో ఈ సినిమాని సామ్ రిజెక్ట్ చేశారట.. దీనితో ఈ ఆఫర్ నయన్‌‌కి వెళ్లినట్టుగా సమాచారం. ఈ సినిమాలో షారూఖ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు.

పిల్లల ప్లానింగ్ సమంతకి ఉందని శాకుంతలం నిర్మాత నీలమ గుణ కూడా వెల్లడించారు. నాగచైతన్యతో ఒక బిడ్డను పొందడానికి సమంత సిద్ధంగా ఉందని అందుకే శాకుంతలం సినిమాని త్వరగా ఫినిష్ చేయాలనీ కండిషన్ కూడా పెట్టిందని ఆమె గతంలోనే చెప్పుకొచ్చింది. కాగా మళ్లీ వరుస ప్రాజెక్ట్ లతో సమంత బిజీ అయిపోయింది.

Tags

Read MoreRead Less
Next Story