Anand Mahindra: 'మహీంద్ర కార్లు రుచిగా ఉంటాయి'.. వైరల్ వీడియోకు ఆనంద్ మహీంద్రా కామెంట్..

Anand Mahindra (tv5news.in)

Anand Mahindra (tv5news.in)

Anand Mahindra: సఫారీ పార్క్‌కు వెళ్లాలంటే ఒకింత సాహసమనే చెప్పాలి.

Anand Mahindra: సఫారీ పార్క్‌కు వెళ్లాలంటే ఒకింత సాహసమనే చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడు ఏ పక్క నుండి ఏ మృగం వస్తుందో అని అనుక్షణం భయం ఉంటుంది. మామూలుగా సఫారీకి వెళ్లిన వాహనాల ఎదురుగా సింహాలు, పులులు రావడాన్ని మనం చాలా వీడియోల్లో చూశాం. అందులో చాలావరకు మృగాలు ఆ వాహనాల మీద దాడి చేయడాన్ని కూడా చూశాం. కానీ ఇటీవల ఓ సఫారీ పార్క్‌లో మాత్రం అందుకు విభిన్నమైన ఘటన ఒకటి చోటుచేసుకుంది.

ఊటీ నుండి మైసూరుకు వెళ్లే రోడ్డులో తెప్పకాడు సమీపంలోని సఫారీ పార్క్‌లో ఆగిన ఓ కారును ఓ పులి వెనక నుండి వచ్చి తన పంటితో పట్టుకుని గట్టిగా కొరికే ప్రయత్నం చేస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర దృష్టిలో పడింది. అయితే ఈ వీడియోను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పాటు ఒక ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ కూడా పెట్టారు.

'ఈ వీడియో సిగ్నల్‌లో బాగా వైరల్ అవుతోంది. ఆ కారు జైలో మోడల్. అందుకే పులి దాన్ని నోట కరుచుకోవడం నాకు ఏ మాత్రం ఆశ్చర్యంగా అనిపించట్లేదు. మహీంద్రా కార్లు చాలా రుచికరంగా ఉంటాయి కదా..!' అని ఆ పులి వీడియోను షేర్ చేస్తూ.. ఈ క్యాప్షన్‌ను దానికి జతచేశారు. దీంతో వైరల్ అయిన ఓ వీడియోను కూడా తమ కార్ల ప్రచారం కోసం ఉపయోగించిన ఆనంద్ మహీంద్రను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.


Tags

Read MoreRead Less
Next Story