Pakistan: పాకిస్థాన్‌లో భూకంపం.. మృతుల్లో ఆరుగురు చిన్నారులు..

Pakistan: పాకిస్థాన్‌లో భూకంపం.. మృతుల్లో ఆరుగురు చిన్నారులు..
Pakistan: భూమిపైనే కాదు లోపల కూడా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దానికి కారణం మనుషులే.

Pakistan: భూమిపైనే కాదు లోపల కూడా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దానికి కారణం మనుషులే. అందుకే ఆ పర్యావరణానికి కోపమొచ్చి మనుషులపైకి సునామీలు, భూకంపంలా రూపంలో దూసుకొస్తున్నాయి. ఇటీవల పాకిస్థాన్‌లో కూడా అదే జరిగింది. గురువారం తెల్లవారుజామున దక్షిణ పాకిస్థాన్‌లో సంభవించిన భూకంపంలో 20 మంది ప్రాణాలను కోల్పోయారు.

తెల్లవారుజామున కాబట్టి ప్రజలు ఈ భూకంపాన్ని వెంటనే గుర్తించలేకపోయారు. మరణించిన వారిలో చాలామంది ఇళ్ల గోడలు కూలి మరణించినవారే. చనిపోయినవారిలో ఒక మహిళ, ఆరుగురు చిన్నారులు ఉన్నట్టు సమాచారం. రిక్టర్ స్కేల్‌పై భూకంపం తీవ్రత 5.7గా నమోదైంది. భూకంపం ధాటికి 200 మందికి పైగా గాయాలపాలయ్యారు. ఈ ఘటనపై బలూచిస్తాన్‌ హోంమంత్రి మీర్ జియా ఉల్లా లాంగా స్పందిస్తూ సహాయక చర్యలు చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story