Nobel Prize 2021: ఇద్దరు జర్నలిస్ట్‌లకు నోబెల్ పురస్కారం..

Nobel Prize 2021: ఇద్దరు జర్నలిస్ట్‌లకు నోబెల్ పురస్కారం..
Nobel Prize 2021: ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్ బహుమతి ఇద్దరు పాత్రికేయులను వరించింది.

Noble Prize 2021: ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్ బహుమతి ఇద్దరు పాత్రికేయులను వరించింది. ప్రజాస్వామ్యానికి వెన్నుదన్నుగా ఉండే భావస్వేచ కోసం పాటుపడినందుకు ఫిలిప్పీన్స్‌కు చెందిన మరియా రెసా, రష్యాకు చెందిన దిమిత్రి మురాతోవ్‌లకు ఈ పురస్కారాన్ని నోబెల్ కమిటీ ప్రకటించింది.

మారియా రెస్సా ఫిలిప్పినో అమెరికన్ జర్నలిస్ట్. సీఎన్‌ఎన్(CNN) ఆగ్నేయాసియా విభాగంలో 20 ఏళ్ల పాటు ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. వ్యక్తి వాక్ స్వేచ్ఛను అనేక వేదికలపై నిర్భయంగా చాటారు. ఫిలిప్పీన్స్ చట్టాల ప్రకారం అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఓసారి అరెస్ట్ అయ్యారు కూడా. అయినా.. తాను నమ్మిన సిద్ధాంతాలకే కట్టుబడ్డారు. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్టే విమర్శకుల్లో మారియా రెస్సా ముందువరుసలో ఉంటారు. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా ఫేక్ న్యూస్ పైనా పోరాటం సాగించారు.

ఇక దిమిత్రి మరటోవ్ రష్యా జాతీయుడు. తాను ఒక రష్యన్ జర్నలిస్ట్, నోవాయా గజెటా వార్తాపత్రిక ఎడిటర్-ఇన్-చీఫ్. 24 ఏళ్ల పాటు ఆ పత్రిక ఎడిటర్‌గా చేశారు. రష్యా ప్రభుత్వ అవినీతిని ఎండగట్టడంలోనూ, మానవ హక్కుల ఉల్లంఘనలపై నిలదీయడంలోనూ నోవాయా గెజెటాకు విశిష్ట గుర్తింపు ఉంది. ఇప్పటి ప్రపంచంలోనూ పాత్రికేయ విలువలు, మూలాలకు కట్టుబడిన మరటోవ్.. 2007లో ఇంటర్నేషనల్ ప్రెస్ ఫ్రీడమ్ అవార్డు, 2010లో ఫ్రాన్స్ ప్రభుత్వం నుంచి లెజియన్ ఆఫ్ ఆనర్ ఆర్డర్ పురస్కారం అందుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story