ముగ్గులతో టీఆర్ఎస్ ప్రచారం జోరు

ముగ్గులతో టీఆర్ఎస్ ప్రచారం జోరు

CAR

సిరిసిల్లాలో టీఆర్‌ఎస్‌ పార్టీ కారు చిత్రాన్ని అద్భుతంగా వేశారు. పురపాలక ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన జగన్‌ అనే చిత్రకారుడు, స్థానిక టీఆర్‌ఎస్‌ మహిళలతో కలిసి రెండు ఎకరాల స్థలంలో గులాబీ రంగు కారును నేలపై తీర్చిదిద్దారు. సిరిసిల్లా- వేములవాడ బైపాస్‌ రోడ్డులో వేసిన ఈ చిత్రాన్ని చూసేందుకు వాహనదారులు, స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

అటు టీఆర్‌ఎస్‌ అభిమానులు కారుగుర్తుపై తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు సిరిసిల్లవాసులు. కారు గుర్తుకే మన ఓటు అంటూ తమ ఇళ్ల ముందు ముగ్గులు వేశారు.

Tags

Read MoreRead Less
Next Story