ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనపై స్పందించిన యాజమాన్యం

ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనపై స్పందించిన యాజమాన్యం

ఎల్జీ పాలిమర్స్‌లో విషవాయువు లీకేజీ దుర్ఘటనపై యాజమాన్యం స్పందించింది. ప్రభావిత గ్రామాలను ఆదుకునేందుకు అన్ని ప్రభుత్వ విభాగాలతో కలిసి పనిచేస్తామని యాజమాన్యం వివరించింది. ఇప్పటికే ఈ మేరకు దిద్దుబాటు చర్యలు చేపట్టినట్టు ప్రెస్‌నోట్‌లో పేర్కొంది. గ్రామాల్లో ఆరోగ్య పరీక్షల కోసం సురక్ష హాస్పిటల్స్‌లో అన్ని సౌకర్యలు కల్పిస్తున్నట్టు చెప్పారు. అలాగే ప్రజలు తమ సమస్యలు చెప్పేందుకు రెండు ఫోన్‌ నంబర్లను (0891-2520884, 0891-2520338) కూడా ఇచ్చారు. ప్రమాదం తర్వాత పరిస్థితులపై ప్రత్యేక సంస్థతో సర్వే చేయిస్తామని కూడా ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం వివరణ ఇచ్చింది. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు కూడా తాము చేపడతామని పేర్కొంది

Tags

Read MoreRead Less
Next Story