కరోనా ఎఫెక్ట్: మరింత మంది ఉద్యోగులకు లే-ఆఫ్ ప్రకటించిన ఎమిరేట్స్
By - TV5 Telugu |10 Jun 2020 7:37 PM GMT
ప్రపంచంలోనే అతి పెద్ద లాంగ్ హాల్ ఎయిర్లైన్ ఎమిరేట్స్. ఈ సంస్థ మరింత మంది ఉద్యోగులకు లే-ఆఫ్ ప్రకటించింది. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా ఈ లే-ఆఫ్ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని సంస్థ పేర్కొంది. అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాతనే.. తప్పనిసరి పరిస్థితుల్లో లే-ఆఫ్ ప్రకటిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. ఎమిరేట్స్ సంస్థలో 60,000 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. మే 31న ఓసారి ఎమిరేట్స్ ఉద్యోగుల లే-ఆఫ్ని ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, గ్లోబల్ ఎయిర్లైన్స్ 84.3 బిలియన్ డాలర్ల నష్టాన్ని ఈ ఏడాది మూటగట్టుకుంది. ఏవియేషన్ రంగంలోనే ఇది అతి పెద్ద నష్టంగా దీన్ని చెప్పవచ్చు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com