ఆ వ్యాఖ్యలపై బొత్స సవాల్
By - TV5 Telugu |17 Jun 2019 1:36 PM GMT
ప్రత్యేక హోదాపై వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం జరిగింది. ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్షనేత చంద్రబాబు పోరాడుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఆ వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా కోసం నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడినట్లుగా చంద్రబాబు ఏనాడైనా మాట్లాడారా అని ప్రశ్నించారు. అలా మాట్లాడినట్లు చూపిస్తే సభలో తలవంచుకుని నిలబడతానని బొత్స సవాల్ చేశారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com