కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాటల్లో తప్పేంలేదు - లక్ష్మణ్

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాటల్లో తప్పేంలేదు - లక్ష్మణ్

హైదరాబాద్ స్లీపర్ సెల్స్ కు అడ్డాగా మారిందన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాటల్లో తప్పేంలేదన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్. సిటీలో NIA దాడులు జరుగుతున్న విషయం నిజంకాదా అని ప్రశ్నించారు. ఉగ్రవాదాన్ని మతంతో ముడిపెట్టాల్సిన అవసరం లేదన్నారు. అసదుద్దీన్ మిత్రుడైనంత మాత్రాన సీఎం కేసీఆర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సరికాదన్నారు లక్ష్మణ్.

సీఎం KCR ప్రతిపక్ష పార్టీలకు కనీస గౌరవం కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు లక్ష్మణ్. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్ ఎంపీలను ఎందుకు ఆహ్వానించలేదని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్ అభ్యర్థులను ఓడించినందుకే ఇలా వ్యవహరిస్తున్నారా అని నిలదీశారు. అసలు మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు సాధ్యమయ్యేదా అని లక్ష్మణ్ ప్రశ్నించారు.

Tags

Read MoreRead Less
Next Story