రాజగోపాల్రెడ్డికి కాంగ్రెస్ను విమర్శించే హక్కు లేదు : మల్లు రవి
By - TV5 Telugu |26 Jun 2019 2:33 AM GMT
కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ అని విమర్శించారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో అసలు నాయకత్వమే లేదని ఆయన మండిపడ్డారు. రాజగోపాల్రెడ్డి విమర్శలకు అంతే ధీటుగా కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేత మల్లు రవి. పార్టీ ద్వారా ఎన్నో పదవులు పొందిన రాజగోపాల్రెడ్డికి కాంగ్రెస్ను విమర్శించే నైతిక హక్కు లేదని అన్నారు. బీజేపీకి వెళ్తే వెళ్లొచ్చని...వెళ్లే ముందు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వెళ్లాలని హితవు పలికారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com