నా పిల్లలకు ఆయన లేని లోటు ఉండకూడదు

నా పిల్లలకు ఆయన లేని లోటు ఉండకూడదు

బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్‌ ఓ ఇంటర్వ్యూలో భావోద్వేగంతో స్పందించారు. తండ్రి లేని లోటు తనకు బాగా తెలుసు అని.. నా పిల్లలకు ఆ లోటు ఉండకూడదు అంటూ బరువెక్కిన గుండెతో చెప్పారు. కత్రినా చిన్నప్పుడే తల్లిదండ్రులు మనస్పర్ధలతో విడిపోయారు. దీంతో ఆమె చిన్నప్పటి నుంచి కత్రినా తండ్రి లేకుండానే పెరిగారు. ఫిలింఫేర్ మ్యాగజిన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ…"ఈ సమాజంలో ఆడపిల్ల జీవితంలో తండ్రి లేకపోతే అది లైఫ్ అసంపూర్తిగానే అనిపిస్తుంది. ఆ ప్రయాణం అభద్రత భావంతో ఉంటుంది. కానీ జీవితంలో తండ్రి లేనంత మాత్రాన ఓ ఆడపిల్ల అన్నీ కోల్పోయినట్లు కాదు. తండ్రి లేని లోటు ఎలా ఉంటుందో నాకు తెలుసు. అందుకే భవిష్యత్తులో నా పిల్లలకు ఆ లోటు ఉండకూడదు. వారికి తల్లిదండ్రులతో కలిసి ఉంటే కలిగే అనుభూతి తెలియాలి".అన్నారు.

"ఓ ఆడపిల్లకు తండ్రి లేనంత మాత్రాన అన్నీ కోల్పోయినట్లు కాదు. మేం మెుత్తం ఏడుగురు తోబుట్టువులం. మా అమ్మ మమ్మల్ని ఏ బాధ లేకుండా చాలా క్రమశిక్షణతో పెంచింది. నాకు ఎదురైన అనుభవాలన్నింటిని నాలోనే దాచుకునేదాన్ని. చిన్నప్పుడు నేను చాలా సైలెంట్‌. హీరొయిన్‌గా ఈ స్థాయికి ఎలా వచ్చానో నాకే తెలీడంలేద'న్నారు. కత్రినా కైఫ్‌, సల్మాన్‌తో నటించిన ‘భారత్‌’ సినిమా జూన్‌ 5న విడదలకు సిద్దమవుతుంది.

Tags

Read MoreRead Less
Next Story