నవోదయలో ఉద్యోగాలు.. 2370 ఖాళీలు..
అసిస్టెంట్ కమిషనర్ (గ్రూప్-ఏ), పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (గ్రూప్-బీ), ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
అసిస్టెంట్ కమిషనర్ (గ్రూప్-ఏ) పోస్టుల కోసం పీజీలో హ్యుమానిటీస్, సైన్స్ లేదా కామర్స్ ఉత్తీర్ణతతో పాటు లెవల్-10 పే స్కేల్ పోస్టులో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి.
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (గ్రూప్-బీ) ఉద్యోగాల కోసం 50 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. బీఈడీ, ఇంగ్లీష్, హిందీ మీడియంలలో బోధించగలిగే ప్రావీణ్యం ఉండాలి.
ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టుల కోసం 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో డిగ్రీతో పాటు బీఈడీ, సీటెట్లో అర్హత సాధించి ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష/కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ/ పర్సనల్ ఇంటరాక్షన్ ద్వారా చేస్తారు.
పరీక్షా కేంద్రం: హైదరాబాద్లో నిర్వహిస్తారు.. దరఖాస్తు: ఆన్లైన్లో జులై 10 నుంచి .. చివరి తేదీ : ఆగస్టు 9 .. ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: ఆగస్టు 12 .. పరీక్ష తేదీలు: సెప్టెంబర్ 5 - 10 .. వెబ్సైట్: www.navodaya.gov.in
Tags
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com