పక్కా.. బిగ్‌బాస్‌లోకి సావిత్రి..

పక్కా.. బిగ్‌బాస్‌లోకి సావిత్రి..

బిగ్‌బాస్.. షో మొదలైన తరువాత వివాదాలు వస్తాయి. అలాంటిది ఇంకా స్టార్ట్ అవకముందే బోలెడంత ప్రచారాన్ని మూటగట్టుకుంది బిగ్‌బాస్3. ఇక ఈ షోలో పాల్గొనే పార్టిసిపెంట్లు ఎవరెవరు అనేది ఫైనల్ లిస్ట్ ఇంకా రాలేదు. ప్రముఖ టీవీ యాంకర్ సావిత్రి బిగ్‌బాస్-3లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇదే విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో సావిత్రి పోస్ట్ చేసిన ఓ వీడియోలో తాను బిగ్‌బాస్‌3లో పాల్గొంటున్నట్లు తెలిపింది. అయితే, ప్రస్తుతం ఆ పోస్ట్‌ను మళ్లీ డిలీట్ చేసినట్లు సమాచారం. ఓ టీవీ చానెల్‌లో సావిత్రక్కగా ఫేమస్ అయిన శివజ్యోతి బిగ్‌బాస్‌లో ఎంటర్ అవుతున్నట్లు గత కొంతకాలంగా కథనాలు వినిపిస్తున్నాయి. 100 రోజులు సాగే ఈ షోలో 15 మంది ఇంటి సభ్యులు ఉంటారు . ఈ సారి షోలో సావిత్రితో పాటు, యాంకర్ శ్రీముఖి, నటి హేమ, వరుణ్ సందేశ్ ఆయన భార్య వితికా షేరు, జర్నలిస్ట్ జాఫర్, ఉయ్యాల జంపాల ఫేమ్ పునర్నవి భూపాలం, నటి హిమజ, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తదితరులు పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఆదివారం నుంచి వస్తున్న ఈ షోలో ఎవరెవరు వుంటారనేది త్వరలోనే తెలియనుంది.

Tags

Read MoreRead Less
Next Story