రేపు జగన్ తో భేటీ కానున్న కేసీఆర్
రేపు వరుస కార్యక్రమాలతో తెలంగాణ సీఎం కేసీఆర్ బిబిబిజీ కానున్నారు. మొదట తెలంగాణలోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే క్వార్టర్స్ను అన్ని హంగులతో సిద్ధం చేశారు. హైదరగూడలో 4.5 ఎకరాల విస్తీర్ణంలో.. 166 కోట్ల రూపాయల వ్యయంతో క్వార్టర్స్ నిర్మించారు. క్వార్టర్స్ ప్రారంభోత్సవం తరువాత అటు నుంచి కేసీఆర్ విజయవాడ వెళ్లనున్నారు..
కృష్ణానదీ తీరంలో స్వరూపానందేంద్ర స్వామి ఆధ్వర్యంలో జరుగుతున్న ఉత్తరాధికారి దీక్షకు హాజరు కానున్నారు. శారాదం పీఠం ఉత్తరాధికారిగా కిరణ్ స్వామి బాధ్యతలు స్వీకరించనున్నారు.. తొలి రెండు రోజులు హోమాలు, ప్రత్యేక పూజలతో కార్యక్రమం వైభంగా సాగింది. చివరి రోజు కిరణ్ స్వామి కాషాయ దీక్ష తీసుకోనున్నారు. ఈ కార్యక్రమానికి కేసీఆర్ హాజరవుతున్నాతున్నారు..
తరువాత ఏపీ సీఎం జగన్ తో కేసీఆర్ ప్రత్యేకంగా కలవనున్నారు. ఈ నెల 21 కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా జగన్ను ఆహ్వానించనున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com