ఊళ్లోకి ప్రైవేట్ స్కూల్ బస్సు రానివ్వం.. గ్రామస్తుల తీర్మానం
ప్రైవేటు స్కూల్ బస్సులు తమ గ్రామంలో రాకుండా అడ్డుకున్నారు రాజన్న సిరిసిల్లా జిల్లాలోని పోత్గల్ గ్రామస్తులు. ప్రైవేట్ బస్సులు ఊళ్లోకి రాకుండా ఇప్పిటికా ఆ గ్రామం పంచాయతీ తీర్మానం చేసింది. ఒక వేళ తమ తీర్మానానికి వ్యతిరేకంగా ఊళ్లోకి ప్రైవేట్ స్కూల్ బస్సు వస్తే దాన్ని అడ్డుకుంటున్నారు. ఇది తెలియకుండా... ఇవాళ ఓ బస్సు ఊళ్లోకి వచ్చింది. అయితే దాన్ని గ్రామ సరిహద్దుల్లోనే అడ్డుకున్నారు.....
పంచాయతీ తీర్మానికి వ్యతిరేకంగా ఊళ్లోకి ఎలా బస్సును తీసుకొస్తావంటూ డ్రైవర్ను నిలిదీశారు. ఆ స్కూల్ యాజమాన్యం రావాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో డ్రైవర్ ఆ బస్సులోను గ్రామ సరిహద్దుల్లోని నిలిపేశాడు.ఇప్పటికే ఉమ్మడి కరీంగనర్ జిల్లాలోని కొన్ని గ్రామాలు ఇలాంటి తీర్మానాలే చేసుకుంటున్నారు. అయితే.. పోత్గల్ గ్రామస్తులు మాత్రం ఓ అడుగు ముందుకేసి ఏకంగా... ప్రైవేట్ బస్సును అడ్డుకోవడంతో అక్కడ కలకలం ఏర్పడింది..
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com