బుల్లితెర పైన యాంకర్ గా కొనసాగుతూనే మంచి మంచి పాత్రలు వచ్చినప్పుడు వెండితెర పైన మెరుస్తుంది అనసూయ
అనసూయని సోషల్ మీడియాలో నెటిజన్లు ఎంతలా ట్రోల్స్ చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. వాటిని డోంట్ కేర్ అంటూ ముందుకు సాగుతుంది ఈ రంగమ్మత్త.
ఇదిలావుండగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమాలో ఇట్స్ టైమ్ టు పార్టీ నౌ అనే పాటలో నటించకపోవడానికి కారణాన్ని వెల్లడించింది.
నేనొక్కదాన్నే అయితే ఆ పాట చేస్తానని కుండబద్దలు కొట్టి మరీ చెప్పిందట అనసూయ.. అయితే దానికి దర్శకనిర్మాతలు ఒప్పుకోకపోవడంతో అనసూయా ఆ సాంగ్ నుంచి తప్పుకుందట.
సోషల్ మీడియాలో ట్రోల్ చేసే వారిపైన స్పందించింది. ఇదంతా నీకవసరమా ఆంటీ, పిల్లలను చూసుకో అని చెప్తుంటారు. అదేదో వాళ్లే నా పిల్లలకు ఫుడ్ పెడుతూ, ఫీజులు కడుతున్నట్లు మాట్లాడుతుంటారు అని అంది అనసూయ.
తనకు డ్రింక్ చేసే అలవాటు ఉందని, ఓసారి అర్థరాత్రి 2 గంటలకు తాగేసి ఉన్నానని నిర్మొహమాటంగా చెప్పుకొచ్చింది అనసూయ.