ఈ యాంకర్ తన ఫ్యామిలీ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది. బాల్యంలో తానూ, తన కుటుంబం అనుభవించిన కష్టాలను వెల్లడించింది.
తాము గతంలో చాలా రిచ్గానే పెరిగామని తెలిపింది. కానీ ఈ విషయాన్ని ఇప్పటివరకు ఎక్కడా కూడా చెప్పలేదని అనసూయ వెల్లడించింది.
తమవద్ద గుర్రాలు ఉండేవని, అయితే తమ తండ్రికి గుర్రపు రేసులు, జూదం పైన పిచ్చి కూడా ఉండేదని, దీని వల్ల తమ ఆస్తి మొత్తం హారతి కర్పూరంలా కరిగిపోయిందని తెలిపింది.
ఇక తన తండ్రి తనని, తన చెల్లల్ని ఎలా పెంచాడో పలు ఇంటర్వ్యూలో వెల్లడించింది అనసూయ.. స్వతంత్రంగా, ధైర్యంగా ఉండాలని తమకి నేర్పినట్టుగా వెల్లడించింది.
ఆటోవాళ్లతో ఎలా మాట్లాడుతున్నా?, వాళ్లను ఎలా హ్యాండిల్ చేస్తున్నాం? అనేది ఆయన దూరం నుంచి ఓ కంట కనిపెడుతుండేవారని ఆ మధ్య వెల్లడించింది.
చిన్నప్పుడు అద్దె ఇంట్లో ఉండేవాళ్లమని, డబ్బులు సరిపోక బస్టాప్ వరకు నడుచుకుంటూ వెళ్లాదన్ని అని వివరించింది.
ప్రస్తుతం అనసూయ నటించిన 'థాంక్ యూ బ్రదర్' సినిమా నేటి నుంచి ఆహాలో ప్రసారం కానుంది. ఇక మరో 6 ప్రాజెక్టులతో అనసూయ బిజీబిజీగా ఉంది.