Sameera Sherief

ఆడపిల్ల అనే సీరియల్‌‌తో సినీ కెరీర్ ప్రారంభించిన సమీరా షరీఫ్‌.. ఎన్నో సీరియల్స్‌‌‌లో నటించి నటిగా మంచి పేరు తెచ్చుకుంది.
ఆ తర్వాత నటుడు నాగబాబు జడ్జీగా వ్యవహరించిన ‘అదిరింది’ షోకి కొద్ది రోజులుపాటు యాంకర్‌గా చేసింది.
సమీరా షరీఫ్‌ తాజాగా తన అభిమానులకి ఓ గుడ్‌న్యూస్‌ చెప్పింది. త్వరలోనే తాను ఓ బిడ్డకు తల్లి కాబోతున్నానని ప్రకటించింది.
సమీరాతో పాటు ఆమె భర్త అన్వర్‌ ఒకే కలర్‌ టీషర్ట్స్‌ ధరించి, దానిపై ఈ విషయాన్నీ ప్రకటించారు.
ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనితో ఈ దంపతులకు నెటిజన్లు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
కాగా.. సమీరా షరీఫ్‌. తెలుగు సీనియర్ నటి సన కుమారుడు అన్వర్‌ని ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసిందే.