జీర్ణక్రియ సక్రమంగా జరిగేందుకు అరటి పండు తోడ్పడుతుంది. నీరసంగా అనిపించినప్పుడు ఓ అరటి పండు తింటే శక్తి వస్తుంది.
అందుకే దాదాపు ప్రతి ఇంట్లో ఏ పండు ఉన్నా లేకపోయినా అరటి పండ్లు మాత్రం కచ్చితంగా ఉంటాయి.
అరటి పండులో ఉన్న పొటాషియం గుండెపై ఒత్తిడి తగ్గించడానికి సహాయపడుతుంది అని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (AHA) తెలిపింది.
అరటిపండ్లు, ఆరెంజ్ పండ్లు తినే పిల్లలకు లుకేమియా వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని పరిశోధకులు గుర్తించారు.
అమెరికాలోని న్యూట్రిషన్ ఫౌండేషన్ వారు స్నాక్స్లో ఆహారంగా అరటి పండును సిఫారసు చేస్తారు. అయితే ఈ పండుని రోజుకు ఒకటి మించి తినకూడదు.
అరటి పండులో ఉంటే పొటాషియం మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
మీడియం సైజు అరటి పండులో 422 మిల్లీగ్రాముల పొటాషియం ఉంటుంది.
పొటాషియం ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్రపిండాలు సరిగా పనిచేయని వారికి ప్రమాదకరం.
మూత్రపిండాలు రక్తం నుండి అదనపు పొటాషియంను తొలగించలేకపోతే, అది ప్రాణాంతకం కావచ్చు.
మైగ్రేన్తో బాధ పడుతున్స వారు వైద్యుల సలహా మేరకు అరటి పండు తీసుకోవాలి.