బాలీవుడ్ సినిమాలకు సంగీతం అందించే విధానంపై మ్యూజిక్ డైరక్టర్ తమన్ తనదైన స్టయిల్లో స్పందించాడు.
బాలీవుడ్లో మ్యూజిక్ ఎలా ఉంటుందంటే.. పెళ్లి ఒకడితో, ఫస్ట్ నైట్ మరొకడితో అన్నట్టు ఉంటుంది. ఒక సినిమాకు ఆరుగురు మ్యూజిక్ ఎలా చేస్తారో నాకు అర్థంకావడం లేదని తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నాడు.
ఒక కథను ఆరుగురు సంగీత దర్శకులు ఎలా చేస్తారో తెలియడం లేదని, ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వేరే ఎవరో చేస్తారు. అలా మనం మనసుపెట్టి చేయలేమని వెనక్కి వచ్చేశానని చెప్పుకొచ్చాడు.
బాలీవుడ్ లో అడుగుపెడితే, పూర్తిస్థాయిలో మ్యూజిక్ అందించే సినిమాతో మాత్రమే రీఎంట్రీ ఇస్తానని స్పష్టంచేశాడు.
బాలీవుడ్ లో అడుగుపెడితే, పూర్తిస్థాయిలో మ్యూజిక్ అందించే సినిమాతో మాత్రమే రీఎంట్రీ ఇస్తానని స్పష్టంచేశాడు.
త్రివిక్రమ్, శంకర్ లాంటి దర్శకులు బాలీవుడ్ లో సినిమాలు చేసినప్పుడు, వాళ్ల సినిమాలతోనే రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నట్టు వెల్లడించాడు.
ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధేశ్యామ్ సినిమాకు తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు