గవర్నర్ నరసింహన్తో ముగిసిన సీఎం కేసీఆర్ సమావేశం
By - TV5 Telugu |2 Jun 2019 1:27 PM GMT
రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ తో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం ముగిసింది. శనివారం గవర్నర్ సమక్షంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి కొనసాగింపుగా ఈ భేటీ జరిగింది. రెండు రాష్ట్రాల మధ్య విభజన అంశాలపై గవర్నర్ నరసింహన్ తో సీఎం కేసీఆర్ చర్చించారు.
ఏపీ, తెలంగాణల మధ్య సమస్యల పరిష్కారంపై ఇద్దరు సీఎంలు ఫోకస్ చేశారు. శనివారం రాజ్భవన్లో గవర్నర్ ఇచ్చిన ఇఫ్తార్ విందుకు హాజరైన కేసీఆర్, జగన్లు 15 నిమిషాలపాటు ఏకాంతంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల మధ్య ఎలాంటి విభేదాలకు తావు లేకుండా కలిసికట్టుగా ముందు కెళ్లాలని గవర్నర్ సూచించారు. అటు రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు, సానుకూల వాతావరణం కోసం ముఖ్యమంత్రులు గవర్నర్తో పలు అంశాలపై చర్చించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com