సఫారీలపై అదరగొడుతోన్న బూమ్రా

సఫారీలపై అదరగొడుతోన్న బూమ్రా

ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో భారత్ బౌలర్లు అదరగొడుతున్నారు. సౌతాంప్టన్ వేదికగా మొదలైన పోరులో బుమ్రా ధాటికి సౌతాఫ్రికా జట్టు ఓపెనర్లు క్రీజులో నిలవలేకపోయారు. బుమ్రా వరుస ఓవర్లలో ఆమ్లా, డికాక్‌లను ఔట్ చేసి అదిరిపోయే ఆరంభం ఇచ్చాడు.

ఆ తర్వాత డుప్లెసిస్, వాండుర్సెన్ నిలకడగా ఆడినప్పటకీ.. భారీ పార్టనర్‌షిప్ నమోదు చేయలేకపోయారు. వీరిద్దరినీ స్పిన్నర్ చాహల్ ఒకే ఓవర్లో ఔట్ చేయడంతో సౌతాఫ్రికా 80 పరుగులకు 4 వికెట్లు చేజార్చుకుంది. 89 పరుగుల వద్ద డుమిని వికెట్‌ తీసాడు కుల్దీప్‌. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఇద్దరు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో బరిలోకి దిగింది.

Tags

Read MoreRead Less
Next Story