సంగారెడ్డిలో భారీ అగ్ని ప్రమాదం

X
By - TV5 Telugu |5 Jun 2019 6:15 PM IST
సంగారెడ్డి జిల్లా జిన్నారం పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గడ్డపోతారంలోని స్పార్ ల్యాబ్ పరిశ్రమలోని సాల్వెంట్ రికవరీ తయారుచేసే యూనిట్లో మంటలు చెలరేగాయి. క్రమంగా అవి పక్క పరిశ్రమలకు వ్యాపించాయి. కెమికల్స్పై నీళ్లు పడడంతో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఇద్దరు గాయపడగా.. వారిని ఆస్పత్రికి తరలించారు. మంటలు ఆర్పేందుకు రెండు ఫైరింజన్లు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com