డొనాల్డ్ ట్రంప్ తాజా సంచలన స్టేట్ మెంట్ ఏంటో తెలుసా..?

డొనాల్డ్ ట్రంప్ తాజా సంచలన స్టేట్ మెంట్ ఏంటో తెలుసా..?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏది మాట్లాడినా సంచలనమే. పర్యావరణ పరరక్షణ విషయంలో ప్రపంచంలోనే అమెరికా మాత్రమే ముందు ఉందన్నారు. వాతావరణ మార్పు, పర్యావరణ పరిరక్షణలో భారత్, చైనా, రష్యాలు అసలు పట్టించుకోవడంలేదని విమర్శించారు. కాలుష్యం, శుభ్రత విషయంలో ఈ దేశాలకు అవగాహన కూడా లేదని నోరుపారేసుకున్నారు. అంతేకాదు ఈదేశాల్లో స్వచ్చమైన గాలీ, నీరు లేదని, భారత్, చైనాలోని నగరాల్లో శుభ్రత గురించి మాట్లాడకపోవడమే మంచిదన్నారు. బ్రిటన్ పర్యటనలో భాగంగా ప్రిన్స్ చార్లెస్ తో సమావేశమైన అనంతరం ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే పర్యావరణ హితం కోసం ప్రపంచ దేశాలు కుదుర్చుకున్న పారిస్ ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగిన సంగతి తెలిసిందే.

Tags

Read MoreRead Less
Next Story