విజయవాడ నుంచి సింగపూర్‌ ఇండిగో విమాన సర్వీసులు ఆగిపోతాయా

విజయవాడ నుంచి సింగపూర్‌ ఇండిగో విమాన సర్వీసులు ఆగిపోతాయా

విజయవాడ నుంచి సింగపూర్‌ వెళ్లే అంతర్జాతీయ విమాన సర్వీసులు ఇక గ్రౌండ్‌ కే పరిమితం కానున్నాయా? జులై 2 నుంచి ఇండిగో సర్వీసులు ఆగిపోతాయా. సాంకేతిక కారణాలతో సర్వీసులు రద్దు చేస్తారా.. ఇంకేదైనా కారణాలున్నాయా అన్న దానిపై క్లారిటీ రావడం లేదు. రిజర్వేషన్‌ కోసం ప్రయాణీకులు ప్రయత్నిస్తుండగా.. జులై 2 తర్వాత సీట్లు చూపించడం లేదు. విజయవాడ నుంచి ఇండిగో సంస్థ 180 సీటర్‌ విమానాలు సింగపూర్‌ కు రోజూ నడిపిస్తోంది. ప్రస్తుతం ఎయిర్‌లైన్స్‌ వ్యాపారంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా సర్వీసులు ఆపడం మేలని భావించినట్టు ఎయిర్‌ పోర్ట్‌ వర్గాలంటున్నాయి. కనీసం 265 సీట్లు నిండితేనే కంపెనీకి నష్టం రాకుండా ఉంటుందని ఆ రంగ నిఫుణులు అంటున్నారు. కానీ మినిమం అక్యుపెన్సీ లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అయితే ఈ విషయాన్ని సంబంధిత ఎయిర్ లైన్స్ లేదంటే పౌరవిమానయాన సంస్థ కన్ఫామ్ చేయాల్సి ఉంది.

Tags

Read MoreRead Less
Next Story