జగన్ తో భేటీ అయిన ముఖ్యమంత్రి కుమారుడు
By - TV5 Telugu |11 Jun 2019 9:43 AM GMT
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్. మంగళవారం ఉదయం బెంగుళూరు నుంచి విమానంలో నేరుగా గన్నవరం వచ్చిన నిఖిల్ అక్కడినుంచి రోడ్డు మార్గాన ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వెళ్లి జగన్ ను కలిశారు.. ఈ సందర్బంగా కాసేపు ఆయనతో మాట్లాడారు. కాగా నిఖిల్ మాండ్య లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీచేసి సినీనటి సుమలత చేతిలో పరాజయం పాలయ్యారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com