నగరి ఎమ్మెల్యే రోజాకు పెద్ద పదవి ఇచ్చిన జగన్..

నగరి ఎమ్మెల్యే రోజాకు పెద్ద పదవి ఇచ్చిన జగన్..

మంత్రివర్గంలో చోటు దక్కక్కపోవడం అసంతృప్తిగా ఉన్న నగరి ఎమ్మెల్యే రోజాకు సీఎం జగన్ పెద్ద పదవి కట్టబెట్టారు. ఆమెను ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక వసతుల సమాఖ్య(ఏపీఐఐసీ) ఛైర్మెన్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలుస్తోంది. కాగా ఇటీవల మంత్రివర్గ విస్తరణలో రోజాకు మంత్రిపదవి దక్కుతుందని అందరూ భావించారు.. కానీ సామాజిక సమీకరణాల దృష్ట్యా ఆమెకు అమాత్యయోగం లభించలేదు. దీంతో రోజా అలకబూనింది. ఈ క్రమంలో మంగళవారం జగన్ ను కలిశారు ఆమె. తాజగా ఏపీఐఐసీ ఛైర్మెన్ గా నియమించారు జగన్.

Tags

Read MoreRead Less
Next Story