భారత సరిహద్దుల్లో మరోసారి రెచ్చిపోయిన పాకిస్థాన్‌

భారత సరిహద్దుల్లో మరోసారి రెచ్చిపోయిన పాకిస్థాన్‌

భారత సరిహద్దుల్లో పాకిస్థాన్‌ మరోసారి రెచ్చిపోయింది. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. జమ్మూ కశ్మీర్ లోని పూంచ్ సెక్టారులోని నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్ సైనికులు కాల్పులకు తెగబడ్డారు. అయితే పాక్ సైనికుల కాల్పులను సమర్ధంగా తిప్పి కొట్టారు భారత జవాన్లు. పుల్వామా ఉగ్ర దాడి అనంతరం కాల్పుల విరమణ ఒప్పందాన్ని తరుచూ ఉల్లంఘిస్తున్నారు పాక్ సైనికులు .పాక్ సైన్యం దాడిని మన సైనికులు వీరోచితంగా తిప్పి కొట్టారు. దీంతో పాక్ సైనికులు పారిపోయారు.

Tags

Read MoreRead Less
Next Story