వారికి కాంగ్రెస్ పార్టీ క్షమాపణలు చెప్పాలి - రాజగోపాల్ రెడ్డి
By - TV5 Telugu |20 Jun 2019 2:44 PM GMT
కాంగ్రెస్ అధిష్టానంపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. కాంగ్రెస్ తనకు షోకాజ్ నోటీసులివ్వడం కాదు.. ప్రజలే కాంగ్రెస్కు షోకాజ్ నోటీసులిస్తారన్నారు. వాస్తవాలు మాట్లాడిన తనకు నోటీసులిస్తే.. వాటికి తాను సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. ఎన్నికల సమయంలో పొరపాట్లు చేసిన నాయకత్వాన్ని కాంగ్రెస్ మార్చలేదని.. అందుకే లోక్సభ ఎన్నికల్లో ఓటమి చవిచూడాల్సి వచ్చిందన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నయం బీజేపీ మాత్రమే అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com