బాలికను గదిలోకి తీసుకెళ్ళి...
ప్రకాశం జిల్లా ఒంగోలులో దారుణం జరిగింది. తన ప్రియుడిని వెతుక్కుంటూ ఒంగోలుకు వచ్చిన ఓ బాలికపై ఆరుగురు యువకులు మాయమాటలు చెప్పి ...సామూహిక అత్యాచారం చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తోంది..
గుంటూరు టౌన్లోని నల్లచెరువుకు చెందిన 16 ఏళ్ల బాలిక.... విజయవాడలో ఓ హాస్టల్లో చదువుతోంది. ఆమెకు అక్కడ ఒంగోలుకు చెందిన కారు డ్రైవర్తో స్నేహం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. దీంతో అతన్ని వెతుక్కుంటూ... ఒంగోలు వచ్చింది ఆ బాలిక. గత సోమవారం రాత్రి 7 గంటలకు ఒంగోలు బస్టాండ్కు చేరుకున్నబాలిక.... తన వద్ద ఫోన్ లేకపోవడంతో... బాజా అనే యువకుడి ఫోన్ తీసుకుని ప్రియుడికి ఫోన్ చేసింది. ఫోన్ కలవకపోవడంతో... ఏం చేయాలో తెలియక రాత్రి పది గంటలవరకు ఒంగోలు బస్టాండ్లోనే ఉండిపోయింది.
ఇది గమనించిన బాజా ఆ బాలికపై కన్నేశాడు. ఆమెను ప్రియుడి వద్ద చేరుస్తానంటూ నమ్మించాడు. ఆ తర్వాత.. తన స్నేహితుడు శ్రీకాంత్తో కలిసి బాలికను........ నలుగురు విద్యార్ధులు ఉండే రూంకు తీసుకెళ్లాడు. అక్కడ ఆ బాలికను నిర్భధించారు. ఆరుగురు కలిసి ఆమెపై ఐదురోజులుగా అత్యాచారం చేశారు...
ఈ దుర్మార్గుల కంబధ హస్తాల నుంచి ఎలాగోలా తప్పించుకుని బయటపడిన బాలిక... నిన్న ఒంగోలు బస్టాండ్ ఔట్ పోస్ట్ పోలీసులను ఆశ్రయించింది. తనకు జరిగిన అన్యాయాన్ని పోలీసులకు వివరించింది. బాధితురాలి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు... ప్రస్తుతం నలుగురిని అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. నిందితుల్లో ఇద్దరు ఇంటర్మీడియట్ విద్యార్ధులు కాగా, మరో నలుగురు ఇంజనీరింగ్ విద్యార్ధులుగా గుర్తించారు పోలీసులు
అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసిన.... నిందితులను కఠినంగా శిక్షించాలంటూ మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఘటనపై మహిళా కమిషన్కు ఫిర్యాదు చేస్తామంటున్నాయి. బాధితురాలికి న్యాయం జరిగే వరకు పోరాడుతామంటున్నాయి..
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com