ఆరేళ్ల చిన్నారిపై దూసుకెళ్లిన టిప్పర్‌

ఆరేళ్ల చిన్నారిపై దూసుకెళ్లిన టిప్పర్‌

సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లిలో విషాదం చోటు చేసుకుంది. టిప్పర్‌ అదుపు తప్పి ఆరేళ్ల చిన్నారిపై దూసుకెళ్లింది. దీంతో చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. టిప్పర్‌ డ్రైవర్‌ను పట్టుకునేందుకు స్థానికులు ప్రయత్నించేలోపే అతను పారిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం కోసం పాపను గాంధీ ఆస్పత్రికి తరలించారు. కళ్లెదుటే బిడ్డ చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story