జగన్ సంచలన నిర్ణయం..ప్రజావేదికను కూల్చేయాలని ఆదేశం

X
By - TV5 Telugu |24 Jun 2019 12:59 PM IST
ప్రజావేదిక కూల్చేయాలని సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ కలెక్టర్ల సదస్సులో మాట్లాడుతూ ఆయన ఈ ఆదేశాలిచ్చారు. ఇవాళ రేపు జరిగే కలెక్టర్లు, ఎస్పీల సదస్సు ముగిసాక దీన్ని కూల్చేయాలని జగన్ అన్నారు. గత ప్రభుత్వం పర్యావరణ నిబంధనలు సహా అన్నింటినీ బేఖాతరు చేస్తూ ఈ ప్రజావేదికను నిర్మించిందని.. ముఖ్యమంత్రి స్థాయిలోనే ఇలా చేయడం అంటే సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా ఉన్నవ్యక్తే రూల్స్ అతిక్రమిస్తే.. ఇక వేరొకరి అక్రమ నిర్మాణాలపై ఎలా చర్యలు తీసుకోగలమన్నారు. ఇకపై ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకే.. ప్రజావేదిక కూల్చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు. దీనికి అధికారులంతా మద్దతుపలికారు. హర్షధ్వానాలతో సీఎంకు అభినందనలు తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com