గుత్తిలో గుంతకల్లు ఎమ్మెల్యేకి చుక్కెదురు!
By - TV5 Telugu |26 Jun 2019 2:27 PM GMT
అనంతపురం జిల్లా గుత్తి లో గుంతకల్లు ఎమ్మెల్యే వెంట్రామిరెడ్డికి రైతుల నుంచి చుక్కెదురు. రైతులకు సబ్సీడి విత్తనాలను పంపిణీ చేయడంలో ప్రభుత్వ అధికారులు జాప్యం చేస్తున్నారంటూ ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. వేరుశనగ విత్తనాల పంపణీ ప్రారంభించడానికి వచ్చిన ఆయనను వర్షాలు కురుస్తున్నా విత్తనాలు మాత్రం అందడంలేని రైతులు నిలదీశారు. దీంతో కాసేపు ఎమ్మెల్యేకు రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. అధికారులతో మాట్లాడిన వెంట్రామిరెడ్డి నాలుగైదు రోజుల్లో రైతులందరికి విత్తనాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. రైతులు శాంతించడంతో విత్తన పంపిణీని ప్రారంభించి వెళ్లారు ఎమ్మెల్యే.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com