విజయనిర్మల మృతి: ‘మహర్షి’ వేడుక వాయిదా

విజయనిర్మల మృతి: ‘మహర్షి’ వేడుక వాయిదా

నటి, దర్శకురాలు విజయ నిర్మల మృతితో ‘మహర్షి’ సినిమా విజయోత్సవ వేడుకను వాయిదా వేశారు. ఇటీవల విడుదలైన మహర్షి మూవీ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా 50 రోజుల విజయోత్సవ వేడుకను జూన్‌ 28న మాదాపూర్‌లోని శిల్పకళా వేదికలో నిర్వహించాల్సి ఉంది. విజయ నిర్మల హటాత్తుగా గుండెపోటుతో మరణించడంతో వేడుకను వాయిదా వేశారు. ఈ విషయాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సంస్థ ట్విటర్‌ వేదికగా ప్రకటించింది.

Tags

Read MoreRead Less
Next Story