బాపట్ల ఎంపీ నందిగం సురేష్ కు కీలక పదవి

X
By - TV5 Telugu |27 Jun 2019 12:01 PM IST
వైసీపీ ఎంపీ నందిగం సురేష్ కు కీలక పదవి దక్కింది. ఆ పార్టీ లోక్ సభా పక్ష ఉపనేతగా ఆయన నియమితులయ్యారు. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, లోక్ సభా పక్ష నేత మిథున్ రెడ్డి లు ఆయనను ఈ పదవిలో నియమించారు. అలాగే ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయులును పార్లమెంటరీ పార్టీ కోశాధికారిగా నియమించింది వైసీపీ. కాగా ఈ ఎన్నికల్లో బాపట్ల లోక్ సభ స్థానం నుంచి టీడీపీ నేత శ్రీరామ్ మాల్యాద్రిపై నందిగం సురేష్ గెలుపొందారు. అలాగే నరసరావుపేట లోక్ సభ స్థానం నుంచి టీడీపీ సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు పై శ్రీకృష్ణ దేవరాయలు విజయం సాధించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com