కన్నతండ్రే కూతురు పాలిట..

కన్నతండ్రే కూతురు పాలిట..

కులం తక్కువ అతన్ని పెళ్లి చేసుకుందని కన్న తండ్రే కూతురు పాలిట యముడయ్యాడు. కులం పిచ్చిలో ఆమె పుట్టింటి వారిని మానవత్వం కూడా మరిచిపోయేలా చేసింది. బాలింత అని చూడకుండా చిత్రహింసలు పెట్టి పొట్టనపెట్టుకున్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఏడు రోజుల పసికందు మొహం చూసైనా కూతుర్ని వదిలిపెట్టలేదు ఆ తండ్రి.

కులం మత్తులో మనిషి అనే విషయాన్నే మరిచిపోయింది బాస్కర నాయుడి కుటుంబం. ప్రసంవం తర్వాత పచ్చి రాక్షుసుడు కూడా ఆ తల్లిపై చెయ్యి చేసుకునేందుకు వెనకాడుతాడు. కాన్పు తర్వాత జాగ్రత్తగా కూతుర్ని కుదుపు లేకుండా ఇంటికి తీసుకెళ్లాల్సిన పుట్టింటి వారు ఒక్కసారిగా ఆమెపై దాడి చేశారు. ఆస్పత్రి నుంచి వస్తున్న హేమవతిని బలవంతంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. చేతకాకున్నా..చేవలేకున్నా ఆమె పుట్టింటివారితో పెనుగులాడింది. తోబుట్టువు చేతగాని స్థితిలో కన్నీరు పెట్టుకున్న కనికరించలేదు. ఆమెను చిత్రహింసలు పెట్టి మరీ ఆమెను పొట్టనపెట్టుకున్నారు.

చిత్తూరు జిల్లా పలమనేరు ప్రాంతంలో పంట పొలాల దగ్గర ఇళ్లుంటాయి. ఊసరపెంట పెంట గ్రామంలో నివాసం ఏర్పర్చుకున్న భాస్కర నాయుడికి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు హేమావతి..అదే ప్రాంతానికి చెందిన కేశవులు అనే దళిత వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అందరికీ దూరంగా వెళ్లి కొన్నాళ్లు గడిపారు ఆ ఇద్దరు. హేమావతి గర్భవతి కావటంతో కాన్పు కోసం తప్పనిసరి పరిస్థితుల్లో అత్తారింటికి చేరుకుంది హేమావతి. కులం తక్కువ అతన్ని పెళ్లి చేసుకుందని అప్పటికే కూతురు మీద పీకల దాక పగ పెంచుకున్న పుట్టింటి వారు. హేమావతి ప్రసవం అయిన ఏడు రోజులకు ఆమెపై దాడి చేశారు.

ఈ ఘటనతో ఊసరపెంట కోసం ఊగిపోయింది. ఏడు రోజుల పసిబిడ్డ మొహం చూసైనా కనికరించని ఆ కటుంబం తమ మధ్య ఉండటానికి వీళ్లేందంటూ రగిలిపోయింది. భాస్కరనాయుడి ఇంటిపై దాడి చేసి ఇల్లు ధ్వంసం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story