అనుమానంతో యువతిపై 12 చోట్ల కత్తి పోట్లు.. పరిస్థితి విషమం

అనుమానంతో యువతిపై 12 చోట్ల కత్తి పోట్లు.. పరిస్థితి విషమం

ప్రేమోన్మాది కత్తిపోట్లతో ఆస్పత్రి పాలైన దీక్ష ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ప్రస్తుతం ఆమె కేఎస్ హెగ్డే మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతోంది. 12 చోట్ల కత్తి పోట్లు కావాటంతో ఆమెకు సర్జరీలు చేసిన డాక్టర్లు 14 రక్తం బాటిల్స్ ను ఎక్కించాల్సి వచ్చింది. మరోవైపు దీక్షపై దాడికి తెగబడిన సుశాంత్ ప్రస్తుతం ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడినట్లు వైద్యులు చెబుతున్నారు. సుశాంత్ ఆరోగ్య పరిస్థితి మెరుగు పడటంతో పోలీసులు అతన్ని ఆస్పత్రిలోనే ప్రశ్నించారు.

దేరాలకట్టె ప్రాంతానికి చెందిన సుశాంత్, దీక్ష కొంతకాలంగా ప్రేమించుకుం టున్నారు. సుశాంత్ డ్యాన్సర్ కాగా, దీక్ష స్థానిక డిగ్రీ కాలేజీలో చదువుకుం టోంది. ఇటీవల వారిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. దాంతో దీక్ష, సుశాంత్‌ ను దూరం పెడుతూ వచ్చింది. తనను వేధిస్తున్నాడంటూ సుశాంత్‌పై స్థానిక పోలీస్ స్టేషన్‌ లో కేసు కూడా పెట్టింది. దాంతో సుశాంత్ రగిలిపోయాడు. దీక్ష వేరే ఎవరినో ప్రేమిస్తోందని, అందుకే తనను దూరం పెడుతోందంటూ అనుమానం పెంచుకున్నాడు. అది కాస్తా పగగా మారింది. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం దీక్ష ఇంటికి వెళ్తుండగా బైక్‌పై వచ్చి అడ్డుకున్నాడు. తనను వెళ్లనివ్వాలంటూ ఆమె చెబుతుండగానే కత్తితో దాడి చేశాడు. నాకు దక్కని నువ్వు ఇంకెవ్వ రికీ దక్కకూడదంటూ విచక్షణ రహితంగా 12 సార్లు పొడిచాడు.

కత్తితో సుశాంత్ డజను సార్లు పొడవడంతో దీక్ష కుప్పకూలిపోయింది. అక్కడే ఉన్న కొందరు, సుశాంత్‌ను ఆపేందుకు ప్రయత్నించినప్పటికీ అతని పైశాచిక ప్రవర్తనను చూసి వెనక్కి తగ్గారు. ఇక, దీక్షను పొడిచే సిన తర్వాత సుశాంత్ తనను తాను పొడుచుకున్నాడు. కత్తితో తన మెడను పలుమార్లు కోసుకొని దీక్ష పక్కనే కుప్పకూలిపోయాడు. అప్పటికే, అక్కడ పోగైన గ్రామస్థులు, వెంటనే వాళ్లిద్దరినీ కేఎస్ హెగ్డే మెడికల్ కాలేజీలో అడ్మిట్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story